మాట ఇచ్చే ముందు ఆలోచిస్తా.. ఇచ్చాక ఆలోచించేది ఏముంది?: అదరగొడుతున్న 'యాత్ర' ట్రైలర్

  • కాసేపటి క్రితం ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్
  • వైయస్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా సన్నివేశాలు, డైలాగులు
  • ఫిబ్రవరి 8న విడుదల కానున్న 'యాత్ర'
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాసేపటి క్రితం ఈ చిత్రం ట్రైలర్ ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్న సన్నివేశాలు, డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి.

ఈ సమాజంలో అన్నింటికన్నా పెద్ద జబ్బు పేదరికం అనే డైలాగ్ జనాల మనసులను తాకేలా ఉంది. ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రను మమ్ముట్టి పోషించగా జగపతిబాబు, సుహాసిని, సుధీర్ బాబు, రావు రమేష్, అనసూయ, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు.
Go Back to Shorts
yatra
movie
trailor
tollywood
ys rajasekhara reddy
ysr

More Telugu News